కామారెడ్డి జిల్లా ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో వివేక్ 

 కామారెడ్డి జిల్లా ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో వివేక్ 

కామారెడ్డి జిల్లా: జుక్కల్ నియోజకవర్గంలో ప్రజా గోస బీజేపీ భరోసా యాత్ర కొనసాగుతోంది. పిట్లం మండలంలో విస్తృతంగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ప్రజల దగ్గరకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. కంబాపూర్ గ్రామంలో మహిళలతో కలిసి పొలంలో నాట్లు వేశారు వివేక్. ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో వివేక్ తో పాటు కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణ తార, సీనియర్ బీజేపీ నేతలు పాల్గొన్నారు.

అనంత‌రం పెద్దపల్లి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నిరాశ్రయులైన కుటుంబాలను కలిసి భరోసా కల్పించారు వివేక్ వెంకటస్వామి. గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీ, మల్కాపురం, మేడిపల్లి, న్యూపోరట్ పల్లి ప్రాంతాల్లో పర్యటించారు. అధికారపార్టీ నేతలు, అధికారులు ఎవరు  తమను పట్టించుకోవడంలేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మేడిపల్లి, న్యూపోరట్ పల్లి ప్రాంతాల్లో నిరాశ్రయులైన 100 కుటుంబాలకు కాకా ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు వివేక్ వెంకటస్వామి.