
మంచిర్యాల/ బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్రంలో సర్కారు విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసి పేదలందరికీ నాణ్యమైన విద్యనందించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. బుధవారం వేదిక ప్రచార జాత రెండో విడతలో భాగంగా మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. మంచిర్యాలలోని చౌరస్తా, బెల్లంపల్లిలో మాట్లాడారు. తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి చేసిన సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
బడీడు పిల్లల సంఖ్య ఆధారంగా రూరల్ఏరియాల్లోని స్కూళ్లను రీ ఆర్గనైజ్ చేయాలని, స్టూడెంట్లకు ఫ్రీ బస్పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. అన్ని స్కూళ్లలో ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించాలని, ప్రతి క్లాస్ రూమ్కు ఒక టీచర్ను నియమించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో విద్యకు 10 శాతం ఫండ్స్ కేటాయించాలని, ప్రీ ప్రైమరీ కోసం రూ.5 వేల గ్రాంట్రిలీజ్ చేయాలన్నారు. ఆయా సమావేశాల్లో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండారపు చక్రపాణి, పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంగ, నేతలు నాగమణి, ధనమూర్తి, బెల్లంపల్లి మండల బాధ్యుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు టీఎస్ యూటీఎఫ్నాయకులు వైద్య శాంతకుమారి, జి.చక్రపాణి, జి.రాజవేణు తదితరులు పాల్గొన్నారు.