చిన్నశంకరంపేట, వెలుగు: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సూరారం జడ్పీహెచ్ఎస్లో పూర్వ విద్యార్థి సొంత ఖర్చులతో ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. పూర్వ విద్యార్థి అయిన హైదరాబాద్ ప్రెస్క్లబ్ మేనేజర్ లక్ష్మీరామచందర్ తన తల్లిదండ్రులు శామమ్మ నరహరి జ్ఞాపకార్థం ఈ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించి మంగళవారం ప్రారంభించారు. అనంతరం 152 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేశారు.
గ్రామ అభివృద్ధి కోసం తనవంతుగా సహకరిస్తానని లక్ష్మీరామచందర్ అన్నారు. ప్లాంట్ ఏర్పాటు చేసినందుకుగానూ ఉపాధ్యాయులు, స్టూడెంట్లు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిలుక నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేశ్, హెచ్ఎం సాయిరెడ్డి, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
