జమ్మూ: దక్షిణ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహాలయ సందర్శనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుండగా, ఆగస్టు 28 వరకు (57 రోజులు) యాత్ర కొనసాగనుందని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం ప్రకటనలో తెలిపారు. యాత్రకు రావాలనుకునే భక్తులు ఈ నెల 15వ తేదీ నుంచి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్నారు. 13 నుంచి 70 ఏండ్ల లోపు వారు మాత్రమే యాత్రకు అర్హులని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న 556 బ్యాంకు శాఖల (ఎస్బీఐ, పీఎన్బీ, ఐసీఐసీఐ, యాక్సెస్, ఎస్బ్యాంక్) ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చని, ష్రైన్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. భక్తుల సౌకర్యాన్ని బట్టి రెండు మార్గాల్లో గుహాలయానికి చేరుకోవచ్చు. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పహల్గామ్ రూట్, గందర్బల్ జిల్లాలోని నిటార్గా ఉండే 14 కిలోమీటర్ల బల్తాల్ రూట్లలో వెళ్లవచ్చు.
