ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు భారీ సంఖ్యలో ఇండియన్ ఎంబసీ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో భయభ్రాంతులకు గురైన స్టూడెంట్లు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను అభ్యర్థించారు. దీంతో కొందరికి ఎంబసీలోనే బస ఏర్పాటు చేశారు. మరికొందరిని దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 200 మందికి ఆశ్రయం కల్పించి వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రకటించారు. విద్యార్థులతో మాట్లాడిన భారత రాయబారి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులను వీలైనంత తొందరగా స్వదేశానికి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Ambassador's Interaction with Indian Students in Kyiv.@MEAIndia @PIB_India @PIBHindi @DDNewslive @DDNewsHindi @DDNational @PMOIndia @IndianDiplomacy pic.twitter.com/jrfXPlzPKY
— India in Ukraine (@IndiainUkraine) February 24, 2022