పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి

తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ పేరును ప్రకటించడంతో... రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్, కళాకారుడు సాయిచంద్  నృత్యాలు చేస్తూ.. హైదరాబాద్ లో సందడి చేశారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.  సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడతామని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. డప్పుచప్పుళ్లు... లంబాడీల నృత్యాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని చేతపట్టుకొని చైర్మన్ నృత్యాలు చేశారు. నూతన పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీ లో తీర్మానం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.