కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి : జెరిపోతుల పరుశరామ్

కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి : జెరిపోతుల పరుశరామ్
  • మంత్రి వివేక్ వెంకటస్వామికి అంబేద్కర్ ఫొటో సాధన సమితి వినతి  

హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు  జెరిపోతుల పరుశరామ్ కోరారు.  బుధవారం మంత్రి వివేక్ వెంకటస్వామిని సోమాజిగూడలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కేబినెట్ లోకి వివేక్ వెంకటస్వామిని తీసుకోవడం అభినందనీయమని అన్నారు.  మంత్రిని ఘనంగా సన్మానించారు.  పరుశరామ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 26 వరకు ప్రధానికి లక్ష మందితో పోస్టు కార్డులు పంపిస్తున్నట్టు చెప్పారు.