- ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు ఎంఓయూ
- కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తోసీఎం సమక్షంలో ఒప్పందం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. యూనివర్సిటీలను బలోపేతం చేయడంతోపాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్గా, డిజిటల్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ(ఐడీఈఏ) ఏర్పాటుకు సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్(సీఓఎల్) సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
సీఓఎల్ అధ్యక్షుడు, సీఈఓ ప్రొఫెసర్ పీటర్ స్కాట్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పరస్పరం ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందంతో అంబేద్కర్ విశ్వవిద్యాలయం డిజిటల్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందనుంది. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఐడీఈఏ అత్యాధునిక డిజిటల్ హబ్గా పనిచేస్తుంది. టెక్నాలజీ ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు వీలు కలగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
