కేసీఆర్ వస్తుండని అంబులెన్స్ ఆపిన్రు

కేసీఆర్ వస్తుండని అంబులెన్స్ ఆపిన్రు

సీఎం కాన్వాయ్ వస్తుందని పోలీసులు అంబులెన్స్ ను నిలిపివేశారు. దీంతో ప్రజల ప్రాణాల కన్నా పోలీసులకు ప్రోటోకాల్ ముఖ్యమా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ సీఎం కేసీఆర్ అసెంబ్లీ చేరుకుంటున్న సమయంలో పోలీసులు రవీంద్రభారతి సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ను ఆపేశారు. అదే సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తరలిస్తున్న అంబులెన్స్ అటుగా వచ్చింది. అయితే సీఎం కాన్వాయ్ వెళ్లేంతవరకూ పోలీసులు అంబులెన్స్ కు దారివ్వలేదు. కాన్వాయ్ వెళ్లాక అంబులెన్స్ ను పంపించారు. ఇదేం ప్రోటోకాల్ అంటూ అక్కడున్న జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.