
- ఉత్పత్తికి సిద్ధమైన ప్లాంటు
- ఏడాది చివర్లోగా ప్రొడక్షన్
- 6.5 లక్షల రైఫిల్స్కు ఆర్మీ ప్రతిపాదనలు
- రష్యా, ఇండియా ప్రతినిధుల మధ్య దశల వారీ చర్చలు
మాస్కో: అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ఫ్యాక్టరీలో ఈ ఏడాది చివరినాటికల్లా ఏకే 203 రైఫిల్స్ఉత్పత్తి మొదలెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏకే 47 సిరీస్లో లేటెస్ట్వెర్షనే ఈ ఏకే 203 రైఫిల్స్. ఈ ఫ్యాక్టరీలో తయారైన ఆయుధాలను ఇండియన్ఆర్మీకి అందజేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్మీ అవసరాలను తీర్చడంలో ముందు ముందు ఈ కంపెనీ కీలకం కానుందని చెబుతున్నారు.
ఆర్మీకి ఆయధాల సప్లై కోసమే ఈ జాయింట్వెంచర్ఏర్పాటయినా.. భవిష్యత్తులో ఆయుధాల ఎగుమతి కూడా చేపట్టనున్నట్లు వివరించారు. మేకిన్ఇండియాలో భాగంగా రష్యాతో ఒప్పందం కుదుర్చుకుని కేంద్రం ఈ ఫ్యాక్టరీని నిర్మించింది. ఇందుకోసం ఇండో రష్యా రైఫిల్స్ప్రైవేట్లిమిటెడ్పేరుతో రెండు దేశాల ప్రభుత్వాలు స్పెషల్ప్రాజెక్టు చేపట్టాయి.
ఒప్పందంలో భాగంగా టెక్నాలజీ ట్రాన్స్ ఫర్(100%)తో పాటు, విదేశాలకు ఎగుమతికీ రెండు దేశాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్కు సిద్ధంగా ఉందని రష్యా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 6 లక్షల ఏకే 203 రైఫిల్స్కు ప్రతిపాదనలు అందుకున్నట్లు చెప్పారు. ఈమధ్యనే కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన మేజర్జనరల్సంజీవ్సెంగర్తన టీంతో కలిసి రష్యాలో పర్యటిస్తున్నారు.
కొత్త రైఫిల్స్తయారీకి సంబంధించి టెక్నికల్ పారామీటర్స్ను పరిశీలిస్తున్నారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో ఈ ఆయుధాల తయారీకి సహకరించేందుకు రష్యా అంగీకరించింది. అమేథీలో తయారుచేసిన రైఫిల్స్ను ఇండియన్ఆర్మీకి సరఫరా చేయడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం కలష్నికోవ్కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, రష్యా ప్రతినిధులతో చర్చల తర్వాత మరో ఒప్పందం కుదుర్చుకుని ప్రొడక్షన్ప్రారంభిస్తామని చెప్పారు.
ఏకే 203 ప్రత్యేకతలు..
కలష్నికోవ్కంపెనీ తయారుచేసిన అత్యాధునిక వెపన్.. ఏకే 47 కు రీవైజ్డ్వెర్షన్. ఒక్కో రైఫిల్తయారీకి దాదాపు వెయ్యి డాలర్లకు పైనే ఖర్చవుతుంది. దాదాపు 20 ఏళ్లుగా ఇండియన్ఆర్మీ వాడుతున్న ఇన్సాస్రైఫిల్స్స్థానాన్ని ఏకే 203తో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.