అమేథీలో AK 203 రైఫిల్స్

అమేథీలో AK 203 రైఫిల్స్
  • ఉత్పత్తికి సిద్ధమైన ప్లాంటు 
  • ఏడాది చివర్లోగా ప్రొడక్షన్
  • 6.5 లక్షల రైఫిల్స్​కు  ఆర్మీ ప్రతిపాదనలు
  • రష్యా, ఇండియా ప్రతినిధుల మధ్య దశల వారీ చర్చలు

మాస్కో: అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్​ఫ్యాక్టరీలో ఈ ఏడాది చివరినాటికల్లా ఏకే 203 రైఫిల్స్​ఉత్పత్తి మొదలెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏకే 47 సిరీస్​లో లేటెస్ట్​వెర్షనే ఈ ఏకే 203 రైఫిల్స్. ఈ ఫ్యాక్టరీలో తయారైన ఆయుధాలను ఇండియన్​ఆర్మీకి అందజేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్మీ అవసరాలను తీర్చడంలో ముందు ముందు ఈ కంపెనీ కీలకం కానుందని చెబుతున్నారు.

ఆర్మీకి ఆయధాల సప్లై కోసమే ఈ జాయింట్​వెంచర్​ఏర్పాటయినా.. భవిష్యత్తులో ఆయుధాల ఎగుమతి కూడా చేపట్టనున్నట్లు వివరించారు. మేకిన్​ఇండియాలో భాగంగా రష్యాతో ఒప్పందం కుదుర్చుకుని కేంద్రం ఈ ఫ్యాక్టరీని నిర్మించింది. ఇందుకోసం ఇండో రష్యా రైఫిల్స్​ప్రైవేట్​లిమిటెడ్​పేరుతో రెండు దేశాల ప్రభుత్వాలు స్పెషల్​ప్రాజెక్టు చేపట్టాయి.

ఒప్పందంలో భాగంగా టెక్నాలజీ ట్రాన్స్ ఫర్(100%)తో పాటు, విదేశాలకు ఎగుమతికీ రెండు దేశాలు అంగీకారం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ ప్రొడక్షన్​కు సిద్ధంగా ఉందని రష్యా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 6 లక్షల ఏకే 203 రైఫిల్స్​కు ప్రతిపాదనలు అందుకున్నట్లు చెప్పారు. ఈమధ్యనే కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన మేజర్​జనరల్​సంజీవ్​సెంగర్​తన టీంతో కలిసి రష్యాలో పర్యటిస్తున్నారు.

కొత్త రైఫిల్స్​తయారీకి సంబంధించి టెక్నికల్ పారామీటర్స్​ను పరిశీలిస్తున్నారు. టెక్నాలజీ ట్రాన్స్​ఫర్​తో ఈ ఆయుధాల తయారీకి సహకరించేందుకు రష్యా అంగీకరించింది. అమేథీలో తయారుచేసిన రైఫిల్స్​ను ఇండియన్​ఆర్మీకి సరఫరా చేయడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం కలష్నికోవ్​కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, రష్యా ప్రతినిధులతో చర్చల తర్వాత మరో ఒప్పందం కుదుర్చుకుని ప్రొడక్షన్​ప్రారంభిస్తామని చెప్పారు.

ఏకే 203 ప్రత్యేకతలు..

కలష్నికోవ్​కంపెనీ తయారుచేసిన అత్యాధునిక వెపన్.. ఏకే 47 కు రీవైజ్డ్​వెర్షన్. ఒక్కో రైఫిల్​తయారీకి దాదాపు వెయ్యి డాలర్లకు పైనే ఖర్చవుతుంది. దాదాపు 20 ఏళ్లుగా ఇండియన్​ఆర్మీ వాడుతున్న ఇన్​సాస్​రైఫిల్స్​స్థానాన్ని ఏకే 203తో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.