జష్పూర్ : చత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేండ్లలో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం ఆ స్టేట్లోని జష్పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్లేస్కు‘శివశక్తి’ అని పేరు పెట్టిందని.. చత్తీస్గఢ్లో మాత్రం సీఎం భూపేశ్ బాఘెల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేవుడి పేరు(మహాదేవ్)తో బెట్టింగ్లకు పాల్పడిందని విమర్శించారు.
ఐదేండ్లలో బాఘెల్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందని షా ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపుతామని చెప్పారు.