చత్తీస్‌‌గఢ్‌‌లో అధికారమిస్తే..ఐదేండ్లలో నక్సలిజం అంతం చేస్తం: అమిత్ షా 

చత్తీస్‌‌గఢ్‌‌లో అధికారమిస్తే..ఐదేండ్లలో నక్సలిజం అంతం చేస్తం: అమిత్ షా 

జష్‌‌పూర్ :  చత్తీస్‌‌గఢ్‌‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఐదేండ్లలో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం ఆ స్టేట్​లోని జష్‌‌పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. చంద్రునిపై విక్రమ్​ ల్యాండర్​ దిగిన ప్లేస్​కు‘శివశక్తి’ అని పేరు పెట్టిందని.. చత్తీస్‌‌గఢ్‌‌లో మాత్రం సీఎం భూపేశ్​ బాఘెల్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేవుడి పేరు(మహాదేవ్)తో బెట్టింగ్‌‌లకు పాల్పడిందని విమర్శించారు.

ఐదేండ్లలో బాఘెల్ ప్రభుత్వం.. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడిందని షా ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన వారందరినీ జైలుకు పంపుతామని చెప్పారు.