ఫిబ్రవరి 24న తెలంగాణకు అమిత్ షా

ఫిబ్రవరి 24న తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖారారైంది. 2024 ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు అమిత్ షా.  పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ నిర్వహిస్తున్న  విజయ సంకల్ప యాత్రలో అమిత్ షా పాల్గొననున్నారు.  గతేడాది డిసెంబర్ 28న తెలంగాణకు వచ్చిన అమిత్ షా..  35శాతం ఓట్లు.. పది ఎంపీ స్థానాలు గెలవాలని తెలంగాణ నాయకత్వానికి టార్గెట్ ఇచ్చారు.   

లోక్ సభ ఎన్నికల వేళ పార్టీ ముఖ్య నేతలంతా ఐక్యంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.    రాష్ట్రాన్ని 5 క్లస్టర్‌గా విభజించి బీజేపీ నేతలు రథయాత్రలో పాల్గొంటున్నారు. తాజాగా ఈ రథయాత్రలో పాల్గొనేందుకు అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. 

కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో పది సీట్లు గెలవాలని తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  అధికారంలోకి రావాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.