కరీంనగర్ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం:బండి సంజయ్

కరీంనగర్ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం:బండి సంజయ్

తెలంగాణలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది.  జనవరి 28 అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వెల్లడించారు.  కరీంనగర్ నుంచే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మొదలవుతుందన్నారు.  కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో 20 వేల మందితో బీజేపీ కార్యకర్తల సమ్మేళనం జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని చెప్పారు.  

ఫిబ్రవరి 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గ్రామాల వారీగా పాదయాత్ర చేస్తానని బండి సంజయ్ చెప్పారు. 20 రోజుల్లో అన్ని మండలాల్లో పర్యటించి కేంద్రం ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చిందో పంచాయతీల వారీగా వివరిస్తానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్  మూడో స్థానానికే పరిమితమవుతుందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ నేతలు  ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారని విమర్శించారు.

అమిత్ షా షెడ్యూల్

  • జనవరి 28న మధ్యాహ్నం1.05 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకి
  • హెలికాప్టర్ లో నేరుగా మహబూబ్ నగర్ లో నిర్వహించే పార్టీ క్లస్టర్ మీటింగ్ కు హాజరు
  • 3.55 గంటలకు కరీంనగర్ లో పార్టీ కార్యకర్తల సమ్మేళనానికి హాజరు
  • తర్వాత హైదరాబాద్ కు చేరుకుని సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ మేధావుల మీటింగ్ కు అటెండ్
  •  రాత్రి 7.45కి బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి