కేంద్ర హోమంత్రి అమిత్ షా ఇన్స్టాగ్రామ్ను కోటిమంది ఫాలో అవుతున్నారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో 1.07 కోట్లమంది ఫాలోవర్లు ఉండగా ఫేస్ బుక్ లో 1.5 కోట్లమంది. ట్విట్టర్ లో 3.4 కోట్ల మంది, యూట్యూబ్ లో 711K మందిసబ్ స్క్రైబర్లు ఉన్నారు. మైలురాళ్లుగా పేర్కొనదగ్గ బిల్లులతో పాటు మూడు క్రిమినల్ కోడ్ చట్టాలు పార్లమెంటులో ఆమోదం పొందడంతో ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
సోషల్ మీడియాలో ప్రధాని మోదీ తరువాత అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేతగా అమిత్ షా ఉన్నారు. మోదీ యూట్యూబ్ ఛానల్ ఇటీవలే 2 కోట్ల సబ్ స్క్రిప్షన్లను అధిగమించి రికార్డు సృష్టించింది. ప్రపంచ రాజకీయ అధినేతలెవరూ కూడా ఈ విషయంలో మోదీ దరిదాపులకు రాలేని పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఫేస్బుక్లో 6.8 మిలియన్లు, ఇన్స్టాగ్రామ్లో 5.1 మిలియన్లు, ఎక్స్లో 24.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.