బాలీవుడ్ బాస్ అమితాబ్ బచ్చన్ కు మళ్లీ కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయానా ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ‘బిగ్ బీ’కి ఇంతకు ముందు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. అప్పట్లో అభిమానులు, సినీ ప్రముఖులు స్పందించి... త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు కూడా చేశారు.
అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్ లో షూటింగ్లో ఉన్నారు. దీంతో పాటు ‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో రణ్బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు నటిస్తున్నారు. ఇదే కాకుండా ‘గుడ్బై’, ‘ఊంచాయి’ సినిమాల్లోనూ బిగ్ బీ నటిస్తున్నారు. రష్మిక మందన్నతో కలిసి మరో సినిమాలో కనిపించబోతున్నారు. కాగా ఆయన కరోనా బారినపడడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. అమితాబ్ కు కరోనా సోకడం ఇది రెండోసారి. సరిగ్గా రెండేళ్ల క్రితం కరోనా సోకినప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని కోలుకున్నారు. అప్పట్లో ఆయనతో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కొవిడ్ బారినపడి కోలుకున్నారు.
T 4388 - I have just tested CoViD + positive .. all those that have been in my vicinity and around me, please get yourself checked and tested also .. ?
— Amitabh Bachchan (@SrBachchan) August 23, 2022