కుంభమేళాకు  వెళ్లి వచ్చిన   మధ్య ప్రదేశ్  ప్రజల్లో... 99 శాతం మందికి  కరోనా

కుంభమేళాకు  వెళ్లి వచ్చిన   మధ్య ప్రదేశ్  ప్రజల్లో... 99 శాతం మందికి  కరోనా

దేశంలో కరోనా  కేసులు  ఓ వైపు పెరుగుతుండగా..  మరో వార్త ఆందోళన  కలిగిస్తోంది. హరిద్వార్  కుంభమేళాకు  వెళ్లి వచ్చిన   మధ్య ప్రదేశ్  ప్రజల్లో...దాదాపు 99 శాతం మందికి  కరోనా పాజిటివ్  వచ్చినట్లు తెలుస్తోంది.   విదిశ జిల్లా  గ్యారస్పుర్ కు చెందిన 60 మందికి   పాజిటివ్ గా నిర్ధారణ  అయింది. గ్యారస్పుర్  నుంచి మహాకుంభ్ కు  83 మందిలో  60 మందికి   పాజిటివ్ వచ్చింది. మిగతా  22 మంది కోసం  గాలిస్తున్నట్లు జిల్లా అధికారులు   తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి 15 మధ్య   వేర్వేరు వెహికిల్స్ లో 83 మంది  కుంభామేళాకు  వెళ్లినట్లు అధికారులు  చెప్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి పాజిటివ్  రావడంతో  కుంభమేళాకు  హాజరైన వారు  క్వారంటైన్ ఉండాలని సూచించారు.