అమూల్ సంస్థ పాల రేటును పెంచింది. లీటరు పాలపై రూ.2 చొప్పున పెంచినట్లు తెలిపింది. ఈ పెంచిన ధర రేపటి నుంచి (మార్చి 1)నుంచి అమలులోకి రానున్నాయి. చివరిసారి జూలై 2021లో అమూల్ సంస్థ పాల రేటును పెంచింది. అముల్ బ్రాండ్లో వస్తున్న అన్ని పాల ఉత్పత్తులపై పెరిగిన ధరలు వర్తిస్తాయని ఆ సంస్థ ప్రకటించింది.
గోల్డ్, తాజా వేరియంట్ పాలపై కూడా ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఆవు, బర్రె పాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులకు కొత్త రేటు వర్తించనుంది. కొత్త ధర ప్రకారం.. 500 మిల్లీలీటర్ల అమూల్ గోల్డ్ పాల పాకెట్ ఇప్పుడు రూ.30కు లభిస్తోంది. అమూల్ తాజా వేరియంట్ రూ.24 కు అర లీటరు వస్తోంది. హాఫ్ లీటర్ అమూల్ శక్తిని 27కి అమ్మనున్నారు.
మరిన్ని వార్తల కోసం..