యుద్ధాలకు కాలం చెల్లింది.. అహింస ఒక్కటే మార్గం

యుద్ధాలకు కాలం చెల్లింది.. అహింస ఒక్కటే మార్గం

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై టిబెటన్ ఆధ్యాత్మిక నేత దలైలామా తీవ్రంగా స్పందించారు. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని తెలిపారు. తూర్పు ఐరోపా దేశంలో శాంతిని త్వరగా పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌పై.. రష్యా దురాక్రమణకు దిగడంపై 14వ దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రపంచం చాలా పరస్పర ఆధారితంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య హింసాత్మక ఘర్షణ ప్రపంచంపై ఎఫెక్ట్ చూపిస్తుందన్నారు.

యుద్ధం అనేది పాతదని, అహింస మాత్రమే సమస్యలకు పరిష్కార మార్గమని అన్నారు. అందరినీ సోదర, సోదరీమణులుగా భావించాలని, మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అప్పుడే మనం మరింత శాంతియుత ప్రపంచాన్ని నిర్మించగలమని తెలిపారు. 20వ శతాబ్దమంతా యుద్ధం, రక్తపాతమయం అయ్యిందని... 21వ శతాబ్దం చర్చల శతాబ్దంగా ఉండాలని చెప్పారు  దలైలామా.

మరిన్ని వార్తల కోసం..

ఢిల్లీ హైకోర్టు జడ్జీలుగా నలుగురు జడ్జీల ప్రమాణం