జమ్మూకాశ్మీర్‌కు అదనంగా 1,800 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు

జమ్మూకాశ్మీర్‌కు అదనంగా 1,800 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల హిందూ కుటుంబాలపై టెర్రరిస్టులు దాడి చేసిన నేపథ్యంలో మరిన్ని బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాశ్మీర్​కు అదనంగా 20  కంపెనీల పారామిలటరీ బలగాలను పంపుతామని సెంట్రల్ రిజర్వ్ పోలీస్  ఫోర్స్ (సీఆర్ పీఎఫ్​)​ ప్రకటించింది. 1,800 మందితో కూడిన ఈ బలగాలను ఎక్కువగా  పూంఛ్,​ రాజౌరీ జిల్లాలో మోహరిస్తామని తెలిపింది.

రాజౌరీలోని డాంగ్రి గ్రామంలో ఈ నెల 1న ఉగ్రవాదులు పౌరులపై జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే అదే జిల్లాలోని మరో గ్రామంలో టెర్రరిస్టులు అమర్చిన మందుపాతర పేలి చిన్నారి సహా ఇద్దరు మరణించారు. దీంతో టెర్రరిస్టుల ఆచూకీ కోసం గత మూడు రోజులుగా భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌లో  నిమగ్నమయ్యాయి.