పార్వతీపురం రైల్వేస్టేషన్‌లో ఏనుగు హల్‌చల్

 పార్వతీపురం రైల్వేస్టేషన్‌లో ఏనుగు హల్‌చల్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్‎చల్ చేసింది.పార్వతీపురం రైల్వేస్టేషన్ తో పాటు  పరిసర ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో గజరాజు స్వైరవిహారం చేసింది. ఏనుగు సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దారితప్పి జనారణ్యంలోకి వచ్చిందని తెలుస్తోంది. కాసేపు కాలనీల్లో కలియ తిరిగి.. ఆ తరువాత రైల్వే స్టేషన్ లో ప్రయాణికులను భయ భ్రాంతులకు గురి చేసింది.  ఆ తరువాత గ్రామ సమీపంలోని కొండ ప్రాంతానికి ఏనుగు వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగును ట్రాక్ చేస్తున్నారు.