ఆగిన డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు

ఆగిన డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ అద్దె బస్సు
  • ఆరుమందికి తీవ్ర, మరికొందరికి స్వల్పగాయాలు
  • ఇబ్రహీంపట్నం  పెద్ద చెరువు కట్టపై ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆగిన డీసీఎంను ఆర్టీసీ అద్దె బస్సు ఢీ కొట్టడంతో పలువురికి తీవ్రగాయాలైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఇబ్రహీంపట్నం నుంచి ప్రయాణికులతో ఎంజీబీఎస్​కు ఆర్టీసీ అద్దెబస్సు (టీఎస్​ 07 యూజి 7172) వెళ్తుంది.

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై మరమ్మతుకు ఆగిన డీసీఎం (ఏపీ31టీబీ 7610) ను  వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సులోని పలువురు ప్రయాణికులు, కండక్టర్​ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురిని సిటీలోని ప్రవేట్​ ఆస్పత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు.