శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా : అనసూయ

 శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా  : అనసూయ

ఓవైపు టీవీ యాంకర్‌‌‌‌‌‌‌‌గా ఆకట్టుకున్న అనసూయ.. డిఫరెంట్ స్ర్కిప్టులతో సినీ ప్రేక్షకులనూ అలరిస్తోంది. తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఆమె కీలక పాత్ర పోషించిన చిత్రం ‘పెదకాపు’. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ జంటగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అన సూయ మాట్లాడుతూ ‘ఇందులో చాలా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాను.  పాత్ర పేరు, స్వభావం కొత్తగా ఉంటుంది. ఇప్పుడే దాని గురించి పూర్తిగా చెప్పలేను. సినిమా చూశాక నా పాత్ర ఇంకా ఇంపాక్ట్ ఫుల్‌‌‌‌గా ఉంటుంది. 

‘రంగస్థలం’లో రంగమ్మత్త తరహాలో ఇందులోని క్యారెక్టర్ కూడా గుర్తుండిపోయేలా ఉంటుంది.  ఇదొక రా ఫిల్మ్.  నా పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. నాతో పాటు హీరోయిన్ ప్రగతి, బ్రిగడ, ఈశ్వరీరావు లాంటి స్త్రీ పాత్రలన్నీ చాలా బలంగా ఉంటాయి.  ప్రేక్షకులు ‘పెదకాపు’ అనే వరల్డ్‌‌‌‌తో కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ చిత్రం ద్వారా చాలా విషయాలను నేర్చుకున్నా. 

విరాట్ కర్ణ కొత్త వాడైనా  చాలా కష్టపడ్డాడు. షూటింగ్‌‌‌‌లో చాలా దెబ్బలు కూడా తగిలాయి. తన పాత్ర చాలా ఫెరోషియస్‌‌‌‌గా ఉంటుంది.  శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. దర్శకుడిగా ఆయనకి ఇది చాలా డిఫరెంట్ ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్. అలాగే నటుడిగానూ ఆయన సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేస్తారు. రవీందర్ రెడ్డి గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అమ్మ నుంచి అమ్మమ్మ వరకు ఏ పాత్రకైనా రెడీ.. కానీ సినిమా చూశాక ఆ పాత్ర గురించే మాట్లాడుకునేలా ఉండాలి’ అని చెప్పింది.