
‘జబర్దస్త్’లాంటి టీవీ షోస్తో ఆకట్టుకుంటున్న రష్మి గౌతమ్.. అడపాదడపా వెండితెరపైనా మెరుస్తోంది. త్వరలో ఆమె నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘వైతరణి’. అఖిల్ బాబు దర్శకత్వంలో ఎ.ఆర్.కాంతలక్ష్మి, ఆర్.రమేష్ బాబు నిర్మిస్తున్నారు. రష్మితో పాటు ప్రదీప్ పల్లి లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ‘భయానికి మరో పేరు.. వైతరణి’ అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్లో రష్మి, ప్రదీప్, రామారావ్ జాదవ్, సంతోష్ నందివాడతో పాటు ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు. కుప్పలుగా పడి శవాల మధ్యలో నుంచి కొందరు భయంగా నడుస్తున్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.
హిందూ మత విశ్వాసాల ప్రకారం వైతరణి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనిషి చనిపోయాక వారి ఆత్మ యమలోకానికి వెళ్లే దారిలో వైతరణి నది ఉంటుందని.. రక్తం, చీము, మూత్రం లాంటి మలినాలతో నిండిన ఆ నదిని పాపులు దాటాల్సి ఉంటుందని చెబుతారు. టైటిల్, పోస్టర్తో ఆసక్తిరేపిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Pradeep Rudra and Rashmi Gautam starring Vaitarani movie first look poster 📽 #VisualDrops #vaitarani #movie #pradeeprudra #actress #rashmigautam #cinemanews @rashmigautam27 pic.twitter.com/3ggr8ogJlo
— Visual Drops (@VisualDrops_) June 29, 2025