నిరుద్యోగ భృతి హామీ ఏమాయె?.. అందెల శ్రీరాములు

నిరుద్యోగ భృతి హామీ ఏమాయె?..  అందెల శ్రీరాములు

ఎల్​బీనగర్ , వెలుగు:  నిరుద్యోగ భృతి పేరుతో సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మహేశ్వరం సెగ్మెంట్ బీజేపీ ఇన్​చార్జి అందెల శ్రీరాములు మండిపడ్డారు. ఇంటింటికి పాదయాత్రలో భాగంగా బుధవారం ఆర్కేపురం డివిజన్​లోని పలు కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. 

ALSO READ:బీజేవైఎం నేతలపై మైనంపల్లి అనుచరుల దాడి

ఈ సందర్భంగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ..  పాదయాత్రలో జనాల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తోందన్నారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ ఆర్కేపురంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను అందెల శ్రీరాములు దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.