
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి నారాలోకేష్ ట్విట్టర్ ఎక్స్ లో స్పందించారు. గత ఏడాది ( 2024) ఇదే రోజున ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. ఏడాదిక్రితం సరిగ్గా ఇదే రోజు విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజలు ఘన విజయం సాధించారని.. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు అని అన్నారు.
#PrajaTeerpuDinam
— Lokesh Nara (@naralokesh) June 4, 2025
ప్రజాస్వామ్యం గెలిచిన రోజు
సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయి. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు. ప్రజా తీర్పు మా కూటమి బాధ్యతను మరింత పెంచింది. @ncbn గారి పాలనానుభవం,… pic.twitter.com/iqtdgipDLl
ఏపీలో ఏడాది క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రజా తీర్పుదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ఇదే స్ఫూర్తితో మాకు అండగా నిలుస్తారని కోరుతున్నానని మంత్రి నారా లోకేశ్ ఎక్స్లో పోస్టు పెట్టారు.