ఏపీలో 4వేలకుపైగా కొత్త కేసులు 

ఏపీలో 4వేలకుపైగా కొత్త కేసులు 

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 4వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 30,886శాంపిల్స్ పరీక్షించగా..4,198 మందికి పాజిటివ్గా నిర్థారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 555 మంది కరోనా బారినపడ్డారు. కృష్ణా జిల్లాలో 528, గుంటూరులో 485, పశ్చిమ గోదావరిలో 446, నెల్లూరులో 378 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. గడిచిన 24 గంటల్లో 9,317 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఈ రోజు చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 88,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తల కోసం..

రిపబ్లిక్‌ డే: తివిధ దళాల్లో బెస్ట్ పరేడ్‌ విన్నర్‌‌గా నేవీ

అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరీపై కేసు నమోదు