
గుంటూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై సహవిద్యార్థులే లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ అమ్మాయికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడి.. వీడియోలు తీసి బెదిరింపులకు దిగారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ వేధిస్తున్నారు. దీంతో వారి వేధింపులను భరించలేక విషయం తల్లిదండ్రులకు చెప్పి కంటతడి పెట్టుకుందామె. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన దిశ పోలీసులు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన కౌశిక్, వరుణ్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ లైంగిక దాడి ఘటన మూడేళ్ల కిందట జరిగినట్టు తెలుస్తోంది. కూల్ డ్రింకులో మత్తుమందు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే, ఆ సమయంలో తీసిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ ఇటవల బెదిరిస్తూ వేధింపులకు దిగారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్నవారిపైనా కఠిన చర్యలు ఉంటాయని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు.