న్యూఢిల్లీ: ఏహెచ్ఎఫ్ జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నీకి ఇండియా జట్టును ప్రకటించారు. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన జట్టుకు డిఫెండర్ అన్మోల్ ఎక్కా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. చైనాలోని మోఖి వేదికగా ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు పోటీలు జరుగుతాయి. ప్రస్తుతం కొత్త కోచ్ ఫ్రెడరిక్ సోయెజ్ పర్యవేక్షణలో బెంగళూరులోని సాయ్ సెంటర్ ఇండియా టీమ్ శిక్షణ తీసుకుంటోంది.
ఇండియా జట్టు: గోల్ కీపర్లు: వివేక్ లక్రా, కునాల్ టెవాటియా. డిఫెండర్లు: అన్మోల్ ఎక్కా (కెప్టెన్), రోహిత్ కుల్లు, చిరాగ్, రవీందర్, అశు మౌర్య, సంజిత్ టిర్కే, సుఖ్విందర్.
మిడ్ఫీల్డర్లు: అద్రోహిత్ ఎక్కా, హర్పాల్, జీత్పాల్, మన్మీత్ సింగ్ రాయ్. ఫార్వర్డ్స్: అజిత్ యాదవ్, ప్రభ్దీప్ సింగ్, గుర్సేవక్ సింగ్, ఆర్యన్ టెసెస్, లవ్నూర్ సింగ్. స్టాండ్ బై: అర్జున్ సంతోష్ హర్గుడే, రితిక్ లక్రా.
