హైదరాబాద్ మూసీ నదిలో డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. మూసారంబాగ్ బ్రిడ్జి దగ్గర మృతదేహం కొట్టుకుపోతుండగా స్థానికులు, అధికారులు చూశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. డెడ్ బాడీ కొట్టుకుపోయింది. వరద వేగం కారణంగా మృతదేహాన్ని వెలికి తీయడం వీలుపడలేదని అధికారులు తెలిపారు.
కాగా, శనివారం నాడు హైదరాబాద్లోని మణికొండలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయాడు. భారీ వర్షం కారణంగా వరద నీటిలో మ్యాన్ హోల్ కనిపించక అతడు అందులో పడిపోవడంతో మరణించగా.. నిన్న రంగారెడ్డి జిల్లా నెక్నంపూర్ చెరువులో డెడ్ బాడీ లభ్యమైంది.