హైదరాబాద్, వెలుగు : ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ‘ఎల్ఐసీ ఎంఎఫ్ నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఈటీఎఫ్’ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఎన్ఎఫ్ఓ ఈ నెల 8న ప్రారంభమయింది. ఇదే నెల 12న ముగుస్తుంది. ఈ పథకంలో 19 ఫిబ్రవరి నుంచి తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు.
పథకాన్ని నిఫ్టీ మిడ్క్యాప్ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్తో పోల్చిచూస్తారు. నిఫ్టీ మిడ్క్యాప్ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్లోని సెక్యూరిటీల మొత్తం రాబడికి సమానంగా రాబడిని అందించడం ఈ పథకం లక్ష్యం. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ. 5000.