బండి సంజయ్ ​బెయిల్ ​రద్దుపై మరోసారి పిటిషన్

బండి సంజయ్ ​బెయిల్ ​రద్దుపై మరోసారి పిటిషన్

హనుమకొండ, వెలుగు: పదో తరగతి హిందీ పేపర్​ లీక్​ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్​ బెయిల్​ రద్దు కోసం హనుమకొండ ఫోర్త్ ఎంఎం కోర్టులో ప్రభుత్వం మరోసారి పిటిషన్ ​దాఖలు చేసింది. రెండు రోజుల కిందే ప్రిన్సిపల్​ డిస్ట్రిక్ట్​ జడ్జి వద్ద పిటిషన్ వేయగా..బెయిల్​ మంజూరు చేసిన ఫోర్త్​ ఎంఎం కోర్టులోనే పిటిషన్​ వేయాల్సిందిగా పీడీజే రిటర్న్​ చేశారు. దీంతో మంగళవారం ఫోర్త్​ ఎంఎం కోర్టులో పిటిషన్​దాఖలు చేయగా..  సెక్షన్లు సరిగా మెన్షన్​ చేయలేదంటూ కోర్టు రిజెక్ట్​  చేసింది.

ఈ మేరకు పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ బుధవారం ఫోర్త్​  ఎంఎం కోర్టులో మరోసారి పిటిషన్​ ఫైల్ ​చేయగా సీఆర్ఎల్​ ఎంపీ 230/2023ను కోర్టు అడ్మిట్​ చేసింది. నిందితుల తరఫు అడ్వకేట్లకు శుక్రవారంలోగా నోటీసులివ్వాలంటూ ఆదేశించింది. కాగా, డిఫెన్స్​ లాయర్లకు నోటీసులు అందిన తరువాత వారు కౌంటర్​ వేసే అవకాశం ఉంది. ఇదిలాఉంటే జువైనల్​ హోం లో ఉన్న ఏ4 తో పాటు మరో ఇద్దరు నిందితులు ఏ7 సుభాశ్​, ఏ8 పోగు శశాంక్​ బెయిల్ పిటిషన్ పై బుధవారం వాదనలు జరిగాయి.  దీంతో మెజిస్ట్రేట్​ ఆర్డర్స్​ ను గురువారానికి పోస్ట్ చేశారు.