“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” పై కోర్టులో మరో పిటిషన్‌

“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” పై కోర్టులో మరో పిటిషన్‌

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” తెలంగాణ హైకోర్టు లో మరో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాలోని ఓ పాత్ర తనను అవమాన పరిచేలా ఉందని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ఈ నెల 21 న ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. తాజాగా ఇంద్రసేనా చౌదరి అనే ఓ వ్యక్తి ఈ సినిమాపై మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సినిమా వల్ల కమ్మ, రెడ్డి కులస్తుల మధ్య గొడవలు జరుగుతాయని,  సినిమా విడుదలను నిలిపివేయాలని తన పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ నెల 29న (శుక్రవారం) ఈ సినిమా విడుదలవనున్న క్రమంలో వెంటనే విచారణ జరపాలని  పిటిషనర్‌ తరపు లాయర్‌ బాలాజీ వదేరా తెలిపారు. దీనిపై హైకోర్టు నేడు విచారణ చేయనుంది.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి పలు వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు మధ్య నెలకొన్న అంశాలను చూపిస్తున్నారు. గతంలో ఆర్జీవీ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా.. పలు వివాదాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.