కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు.. హరీశ్ చెప్పిన సమాధానాలివే..

కాళేశ్వరం కమిషన్ అడిగిన   ప్రశ్నలు.. హరీశ్ చెప్పిన సమాధానాలివే..
  •  బ్యారేజీలు నింపాలని ఎవరూ ఆదేశించలే
  • బ్యారేజీల ప్లానింగ్ ఎక్స్ పర్ట్స్ కే తెలుసు
  • సీడబ్ల్యూసీ సూచన మేరకే నిర్మాణాలు చేపట్టాం..

లొకేషన్ల మార్పుపై కమిషన్ ప్రశ్నలు.. హరీశ్ సమాధానాలు..

కమిషన్: అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ లు ఎవరు మార్చారు?
హరీశ్: అది ఇంజనీర్ల నిర్ణయం.. ప్రభుత్వానికేం సంబంధం
కమిషన్:  బ్యారేజీల్లో నీళ్లు నింపమని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందా?
హరీశ్:  ప్రభుత్వం నుంచి ఎవరూ ఆ నిర్ణయం తీసుకోలేదు.  అది అధికారుల డెసిషన్.
కమిషన్: అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు 2016 లోనే ఒప్పందం జరిగినా.. 2018 లో భూసేకరణను ఆపేసి ఫ్లడ్ బ్యాంక్, డ్రైనేజీ ఛానల్స్ నిర్మించాలనుకోవడం తప్పుడు ప్లానింగ్ కాదా? 
హరీశ్:  ప్రభుత్వానికి సంబంధం లేదు.. అది ఇంజనీర్ల నిర్ణయం
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్ ను ఏ పర్పస్ లో ఏర్పాటు చేశారు?
హరీశ్:   పెద్ద ప్రాజెక్టులు కట్టడానికి సరిపడా నిధులు లేవు.. రుణ సమీకరణ కోసం ఏర్పాటు చేశాం. కార్పొరేషన్ రుణ చెల్లింపులకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది.  సరిపడా బడ్జెట్ కూడా కేటాయించాం. 
కమిషన్: సబ్ కమిటీ ఏర్పాటు ఎందుకు చేశారు.. ఉద్దేశం ఏమిటి?
హరీశ్ : రైతులకు ఎక్కువ సంఖ్యలో నీళ్లు అందించడానికి అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.. అందులో నేను, తుమ్మల నాగేశ్వరరావు ఈటల రాజేందర్  ఉన్నం
కమిషన్: మేడిగడ్డ ఎవరు ప్లాన్ చేశారు..
హరీశ్: సీడబ్ల్యుసీ, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి తుమ్మిడిహెట్టి వద్ద నుంచి మేడిగడ్డ కు మార్చాం. 16 లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని సీడబ్లూసీ చెప్పింది. అందుకే బ్యారేజీలు, రిజర్వాయర్ల సంఖ్య పెంచాం 
కమిషన్: అన్నారం, సుందిళ్ల నిర్మాణం ఎవరి నిర్ణయం
హరీశ్: వ్యాప్కాన్స్ సంస్థ నివేదికల ఆధారంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాం 
కమిషన్: అన్నారం సుందిళ్ల లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? 
హరీశ్: లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్. ఆ నివేదికల ఆధారంగా లొకేషన్స్ మారాయి. బ్యారేజీలు, ప్రాజెక్టుల లొకేషన్స్ మారడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో నాగార్జున సాగర్, కాంతనపల్లి లాంటి ప్రాజెక్టులు లొకేషనులు మారాయి. ఏలేశ్వరం దగ్గర కట్టాలనుకున్న నాగార్జున సాగర్ నందికొండకు మారింది. 
కమిషన్:  ప్రాజెక్టుల లొకేషన్లో మార్చే అధికారం హై పవర్ కమిటీకి అధికారం ఉందా? 
హరీశ్ : అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది.
కమిషన్: మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వొచ్చు ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందా? 
హరీశ్ : డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వడం సాధ్యం కాదని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది.

కార్పొరేషన్ ఏర్పాటుపై..

కమిషన్: కాలేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏంటి?
హరీశ్: లోన్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం 
కమిషన్: కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపేమెంట్స్ ఎలా చేయాలనుకున్నారు.
హరీశ్: నీళ్లను అమ్మి లోన్లను రీ పేమెంట్ చేయాలి అనుకున్నాం.
కమిషన్:  కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా? అయితే ఇంత చేశారు? 
హరీశ్: కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు డిలే అయింది. మెదక్ లో  కోకా కోలా కంపెనీ లాంటి సంస్థలు వచ్చాయి.

స్టోరేజీపై అడిగిన  ప్రశ్నలివే..

కమిషన్: బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేశారా? 
హరీశ్: టెక్నికల్ అంశాలు మా దృష్టిలో ఉండవు 
కమిషన్: కాలేశ్వరం ద్వారా ఎన్ని నీళ్ల  స్టోరేజీ చేశారు 
హరీశ్: రిజర్వాయర్ల ద్వారా 141 టీఎంసీలు  స్టోరేజ్ చేశాం 
కమిషన్: బ్యారేజీలలో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లను స్టోర్ చేశారా ? 
హరీశ్: టెక్నికల్ అంశాలు అధికారులు మాత్రమే చూసుకుంటారు.
కమిషన్: బ్యారేజీలలో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా? 
హరీశ్: బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరూ ఆదేశించలేదు