ఇంటింటికీ యాంటీ కరోనా టీం

ఇంటింటికీ యాంటీ కరోనా టీం

కొవిడ్ లక్షణాలున్నోళ్లను గుర్తించండి

హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్​ఎంసీ, స్కూల్ ఎడ్యుకేషన్​, హోం శాఖ, ఐ అండ్​ పీఆర్​, టూరిజం, ట్రాన్స్​పోర్ట్ డిపార్ట్​మెంట్లకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. జీహెచ్​ఎంసీ పరిధిలోని బస్​ స్టాప్​లు, రైల్వే.. మెట్రో స్టేషన్లు, పబ్లిక్​ ప్లేసుల్లో హోర్డింగులపై కరోనా నివారణపై ప్రచారం చేయాలని, ఈ పనులన్నీ శుక్రవారం రాత్రిలోగా పూర్తి చేయాలని సూచించింది. జోన్​కు ఒక నోడల్​ ఆఫీసర్​ను నియమించి క్షేత్ర స్థాయి సిబ్బందితో రాపిడ్​ రెస్పాన్స్​ టీమ్​లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సిబ్బంది ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలున్నవారిని గుర్తించాలని పేర్కొంది. ఈ టీమ్​లు హోం ఐసోలేషన్​లో ఉన్న వారిని 14 నుంచి 28 రోజులపాటు పర్యవేక్షించాలని చెప్పింది. స్కూళ్లలో ప్రేయర్ టైంలోనే పిల్లలకు కరోనా వైరస్ వ్యాప్తి గురించి అవగాహన కల్పించాలని, అన్ని సోమవారాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖకు సూచించింది.  విదేశీ టూరిస్టులను గుర్తించి వివరాలను డీఎంహెచ్​ఓకు అందజేయాలని టూరిజం అధికారులకు సూచించింది.

For More News..

నిజామాబాద్ ​ఎమ్మెల్సీ రేసులో కవిత

తుంపర్లతో వస్తది.. శానిటైజర్లతో సస్తది

మార్చి 31 వరకు కరోనా సెలవులు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాఫ్ డే స్కూల్స్ తేదీ ఖరారు