
మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణాణం చోటు చేసుకుంది. ఈ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డితో పాటుగా స్నార్ట్ పబ్ యజమానికి, మరోకరికి ముందస్తు బెయిల్ ఇస్తూ 2023 సెప్టెంబర్ 21 గురువారం రోజున ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వీరిని సెప్టెంబర్ 26న పోలీసుల ముందు సరెండర్ కావాలని ఆదేశించింది. వీరిని అరెస్ట్ చేసి బెయిల్ మంజూరు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ప్రతి సోమవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలీసుల ముందు హాజరు కావాలని తెలిపింది. డ్రగ్స్ కేసులో ఈ ముగ్గురు వినియోగదారులుగా ఉన్నారు.
హీరో నవదీప్కు నోటీసులు
టాలీవుడ్ హీరో నవదీప్ కు నార్కోటిక్ బ్యూరో పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు.. 2023 సెప్టెంబర్ 23న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హెచ్ న్యూ ఆఫీస్ లో విచారకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A-29 గా నవదీప్ ను చేర్చారు పోలీసులు. నవదీప్ తన ఫ్రెండ్ రామ్ చంద్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రామ్చంద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా నవదీప్ కు 41 A కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.