రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కేసుల సంఖ్యకు తగ్గట్టుగా కోవిడ్ పరీక్షలు చేయడం కోసం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ టెస్టులు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిహెచ్ఎమ్సీ పరిధిలోని 50 సెంటర్స్ లలో, రంగారెడ్డి లో 20 సెంటర్స్, మేడ్చల్ లో 20 సెంటర్స్ లలో ఈ టెస్ట్లు ప్రారంభమయ్యాయి.
ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్) మ్యాక్సీమం 25 శాంపిల్స్ తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి, కాంటాక్ట్ హిస్టరీ ఉన్నవారికి టెస్ట్ లు చేయాలని తెలిపారు. 30 నిమిషాలలోనే ఈ టెస్ట్లకి సంబంధించి రిజల్ట్ కావడం తో కరోనా అనుమానితులు ముందు తమకే చెయ్యండని ముందుకు వస్తుండడంతో ఎవరిని సెలెక్ట్ చెయ్యాలో హెల్త్ సిబ్బందికి అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. 15 నుంచి 30 నిమిషాలలో రిపోర్ట్ రాకపోతే ఈ టెస్ట్ లో ఫాల్స్ రిజల్ట్ గా పరిగణిస్తారు.