
బాహుబలి సీరీస్ తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది అనుష్క. భాగమతి, మిస్ షెట్టీ మిస్టర్ పోలిషెట్టి సినిమాలు పర్లేదు అనిపించినా.. అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఈ మధ్య పడలేదు. అందుకే ఎలాగైనా బంపర్ హిట్ కొట్టాలనే పంతంతో ఉంది ఈ జేజమ్మ.
స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో చేస్తున్న “ఘాటీ” సినిమాపై భారీగా హోప్స్ పెంచేసుకుంది అనుష్క. ఈ మూవీ గ్లింప్స్ చూసిన తర్వాత మరో అరుంధతి అవ్వడం పక్కా అని ఇప్పటికే ఫ్యాన్స్ ఎదురు చూస్తు్న్నారు. ఆల్మోస్ట్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన సందర్భంగా రిలీజ్ కు రెడీ అవుతున్నారు నిర్మాతలు.
ఇప్పటికే ఈ మూవీని ఏప్రిల్ 18న రిలీజ్ చేయాలనుకున్నా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆలస్యమైనందు వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా మేకర్స్ మంచి అప్డేట్ ను సిద్ధం చేశారు.
రేపు అంటే జూన్ 2 న ఈ సినిమాకు సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలకు మూవీపై బిగ్ అనౌన్సమెంట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే ఈ అప్ డేట్ రిలీజ్ డేట్ కు సంబంధించే ఉంటుందని టాలీవుడ్ టాక్ నడుస్తోంది. మరి రిలీజ్ అప్డేట్ ఇస్తారా లేక ఇంకేమైనా ఇంపార్టెంట్ అప్ డేట్స్ చెప్తారా అనేది చూడాలి.
అనుష్క, క్రిష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సినిమాలో విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తు్న్నారు. విద్యా సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయడానికి యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేస్తోంది.