
మల్కాజిగిరి, వెలుగు: మానసికంగా దృఢంగా ఉంటే ప్రపంచాన్ని కూడా జయించవచ్చని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరిలోని జీకే ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఏ రంగంలో రాణించాలన్నా మానసిక ప్రశాంతత ముఖ్యమన్నారు. మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్, ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ ప్రొఫెసర్ పఠాన్ ఉమర్ ఖాన్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ దొంతుల ప్రవీణ్, టీపీఏ జిల్లా అధ్యక్షురాలు అలియా పర్వీన్ పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వినతి..
తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే మాటిచ్చారు.