కూకట్ పల్లి డ్రగ్స్ కేసులో ఆంధ్రా కానిస్టేబుల్ : పోలీసుల దాడితో పరారీ

కూకట్ పల్లి డ్రగ్స్ కేసులో ఆంధ్రా కానిస్టేబుల్ : పోలీసుల దాడితో పరారీ

హైదరాబాద్ కూకట్ పల్లిలో డ్రగ్స్ దందా గుట్టు రట్టయ్యింది.. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారంతా ఏపీలోని అద్దంకికి చెందినవారని తెలుస్తోంది. ఈ కేసులో తిరుపతికి చెందిన మరో కానిస్టేబుల్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్ నుంచి 800 గ్రాముల ఎపిడ్రిన్, హెరాయిన్., స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు పోలీసులు.

హైదరాబాద్ లో డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నప్పటికీ తరచూ స్మగ్లర్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది.. శనివారం ( మే 30 ) సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. ఒకటిన్నర కిలోల హెరాయిన్‌ను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. నగర శివారు షాద్‌నగర్‌లోని ఓ దాబాలో స్మగ్లర్ల ముఠా డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు సదరు దాబాపై మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో హెరాయిన్‌తో పాటు గంజాయి, ఓపీఎం డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. 

ALSO READ : నర్సు నిర్లక్ష్యం.. తెగిపడిన పసికందు చేతి వేలు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరీ ఇంత నిర్లక్ష్యమా..?

పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.3 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువత జీవితాన్ని చిత్తు చేస్తోన్న మత్తు పదార్ధాలు, డ్రగ్స్‎ను ఉపేక్షించొద్దన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్‎గా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్ స్మగ్లర్ల ఆట కట్టిస్తున్నారు.