ఏపీలో కరోనా కొత్త కేసులు 141, ముగ్గురి మృతి

ఏపీలో కరోనా కొత్త కేసులు 141, ముగ్గురి మృతి

అమరావతి:  రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి నెమ్మదించాయి. గడచిన 24 గంటల్లో 15 వేల 213 మందికి పరీక్షలు చేయగా 141 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే మరో ముగ్గురు కోలుకోలేక మృతి చెందారు. చిత్తూరు, కృష్ణా, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు కరోనా నుంచి కోలుకోలేక చనిపోయారు. మరో వైపు గడచిన 24గంటల్లో 1,329 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24గంటల్లో కొత్త కేసులు జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 27 కేసులు నమోదు కాగా.. కడప జిల్లాలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. నెల్లూరు జిల్లాలో మాత్రం ఒకే ఒక్క కేసు నమోదు అయింది. జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఇవి కూడా చదవండి

రష్యా యుద్ధ ట్యాంకులను నిలువరించడానికి ఒకే ఒక్కడు ఏం చేశాడంటే..

బాంబు మోతల మధ్య అండర్ గ్రౌండ్ బంకర్ లో గర్భిణి ప్రసవం

టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే క్రాష్ అయింది

రష్యా సైనికులను నిలదీసిన ఉక్రెయిన్ మహిళ