అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజు రోజుకూ తగ్గుముఖం పడుతోంది. గడచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల 654 మందికి పరీక్షలు చేయగా 136 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోలేక చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తి చనిపోయారు. మరో వైపు 803 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2వేల 850 మాత్రమే ఉన్నాయి. కొత్త కేసుల విషయానికి వస్తే జిల్లాల వారీగా అత్యధికంగా గుంటూరు జిల్లాలో 26 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు కూడా రాలేదు. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి...
ఇవి కూడా చదవండి
థియేటర్లు సీజ్ చేయలేదు..అదంతా దుష్ప్రచారం
రష్యా సైన్యంపై తిరగబడుతున్న పిల్లలు, మహిళలు
ఉక్రెయిన్ అధ్యక్షుడి ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్
ఏపీ సర్కార్పై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు