ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో వైఎస్ జగన్ కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ST, SC, OC, BC, ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు నాయకులను ఉప ముఖ్యమంత్రులు చేయాలని జగన్ నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.