ఏపీలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు వీరే

ఏపీలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు వీరే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో వైఎస్ జగన్ కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తున్నారు. అన్ని సామాజిక వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ST, SC, OC, BC, ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురు నాయకులను ఉప ముఖ్యమంత్రులు చేయాలని జగన్ నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

పీడిక రాజన్న దొర (సాలూరు) – ST

సుచరిత (ప్రత్తిపాడు) – SC

ఆళ్ల నాని (ఏలూరు) – OC కాపు

అంజాద్ బాషా (కడప) – ముస్లిం

కొలుసు పార్థసారథి (పెనమలూరు) – బీసీ యాదవ