
ఏపీ మాజీ మంత్రి అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆఫ్రికా.. విదేశాల్లో.. ఆస్తులు కొన్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని.. తన ఆస్తులపై సిట్ వేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి.. వెయ్యి కోట్లు ఉన్నాయంటున్నారు.. ఉంటే అమరావతికి తీసేసుకోండని మాజీ మంత్రి అనీల్ యాదవ్ అన్నారు.
తా ను ఎలాంటి అక్రమాస్తులను సంపాదించలేదని.. .. ఆఫ్రికాలో ఎలాంటి మైనింగ్స్ లేవన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించమని డిమాండ్ చేశారు. .. 2008కి ముందున్న.. ఇప్పుడున్న ఆస్తులపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. క్వార్ట్జ్ మైనింగ్ పై ఈడీ విచారణ చేయించండి. గతంలో కాకాణితో నాకు మనస్పర్థలు ఉండేవి.. మేం కలిసి ఎలా వ్యాపారం చేస్తాం. నా పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.. గూడూరులో ఇసుక అక్రమాలకు పాల్పడినట్లు కేసు పెట్టారని తెలిపారు.