ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త

ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త

అమరావతి: ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త. వేతన, ఉద్యోగ విరమణ చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియారిటీ ప్రాతిపదికన చెల్లింపులు జరపాలని, అది కూడా ఈనెల 30 నాటికి చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం వల్ల 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. 2017 మరియు 2019 మధ్య కాలంలో గత ప్రభుత్వం రూ.146.04 కోట్ల మేర బకాయిలు పెట్టిందని ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది.