ద్వివేదీకి ఏపీ ప్రభుత్వం కొత్త పోస్ట్

ద్వివేదీకి ఏపీ ప్రభుత్వం కొత్త పోస్ట్
  • పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి చీఫ్ సెక్రటరీగా నియామకం
  • ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పనిచేసిన గోపాలకృష్ణ ద్వివేదికి  ఏపీ ప్రభుత్వం ఓ కీలక పదవిని అప్పగించింది. గోపాలకృష్ణ ద్వివేదినీ ‘పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి’ మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు.