ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం- వారంలో రెండ్రోజులు స్కూళ్ల‌కు

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం- వారంలో రెండ్రోజులు స్కూళ్ల‌కు

అమ‌రావ‌తి: క‌రోనా క‌ట్ట‌డి క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జూలై 13 నుంచి ప్ర‌ధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారానికి రెండ్రోజులు( సోమ‌, గురు) స్కూళ్ల‌కు హాజ‌రుకావాల‌ని ఏపీ ప్ర‌భుత్వం సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. UDISE+డేటాను జూలై 10లోగా టీచ‌ర్లు ఫినిష్ చేయాల‌ని .. నాడు-నేడు ప‌నుల‌కు ఎంపికైన స్కూళ్ల‌లో కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని చెప్పింది. అలాగే విద్యార్థుల బ్రిడ్జి కోర్సుల‌కు సంబంధించి టీచ‌ర్లు ప్రణాళిక రూపొందించాల‌ని..ప్రాధ‌మిక‌, ఉన్న‌త పాఠ‌శాల‌ల‌కు ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది.

ఇందుకు సంబంధించిన కొన్ని ప్ర‌ణాళిక‌లు ఇలా ఉన్నాయి..
– ఉపాధ్యాయుల్లో ఎవరైనా కంటోన్మెంట్ జోన్, పీహెచ్, వి హెచ్, తీవ్ర వ్యాధులతో బాధపడే వారికి మినహాయింపు.
-పాఠశాలల అభివృద్ధి ప్రణాళికన పేరెంట్స్ కమిటీ సహాయంతో సిద్ధం చేసుకోవాలి.
-రాబోవు అకడమిక్ ఇయర్ కు సిద్ధమయ్యే విధంగా బ్రిడ్జి కోర్సును అమలు చేయుటకు హైటెక్, లోటెక్, నోటెక్ … వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి.
– ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఇచ్చిన బ్రిడ్జి కోర్సు మానిటరింగ్ నిమిత్తం జులై 13 నుండి ఉపాధ్యాయులు వారంలో 2 రోజులు పాఠశాలకు హాజరు కావాలి.
-ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో బ్రిడ్జి కోర్సు మెటీరియల్ online & offline తయారు చేసి , వారి ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే విధంగా స్టూడెంట్స్ కు చెప్పాలి.
-విద్యార్థులందరికీ స్కూల్ లైబ్రరీ బుక్స్ పంపిణీ చేయాలి. పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేనాటికి సాధ్యమైనన్ని ఎక్కువ బుక్స్ చదివే విధంగా చూడాలి.
– గత తరగతి పాఠ్యాంశాలు ఆధారంగా ప్రస్తుత తరగతికి పనికొచ్చే విధంగా ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వాలి.
-విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, వారి విద్యాభ్యాసం మానిటర్ చేయాలి.
– పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయుడు డిజిటల్ సాధనాలు లేని 10 నుండి 20 మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలి.
– స్కూల్స్ రీ ఓపెన్ అయ్యేవరకు వారి విద్యాభ్యాసాన్ని మానిటర్ చేయాలి.
-ఉపాధ్యాయులందరికీ సంబంధిత వర్క్ డిస్ట్రిబ్యూషన్ ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి.
-ఇందు కోసం జులై 13 నుండి ప్రాథమికోన్నత, హై స్కూల్ ఉపాధ్యాయులంతా వారంలో రెండు రోజులు సోమ, గురువారం పాఠశాలకు హాజరు కావాలి.