టీడీపీ మాజీ ఎంపీ జేసీదివాకర్ రెడ్డికి భద్రతను తొలగించింది ఏపీ ప్రభుత్వం. జేసీకి 1+1 భద్రతను తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గతంలో గన్మెన్లను 2+2 నుంచి 1 + 1 కు తగ్గించిన ప్రభుత్వం స్టేట్ సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకే భద్రత తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు శాఖ సర్కులర్ జారీ చేసింది. ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు అధికారులు. జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం గత ప్రభుత్వంలో కేటాయించిన భూములను రద్దు చేసింది ప్రభుత్వం.
see more news