పోలీసులా.. వైసీపీ గూండాలా : షర్మిల

పోలీసులా.. వైసీపీ గూండాలా : షర్మిల

సత్తెనపల్లిలో యూత్‌కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులు, వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం  పోలీసులతో  ఇబ్బంది పెడుతుందని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు.   ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపితే పోలీసుల బూట్లతో తొక్కిస్తారా ... కాంగ్రెస్ కార్యకర్తలను గొంతు పిసికి చంపాలని చూస్తున్నారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  వైసీపీ గూండాలను పక్కనపెట్టుకొని మరీ దాడులు చేయిస్తారా... మీరు పోలీసులా... వైసీపీ కిరాయి మనుషులా... ఏపీ పోలీసులు కండావా లేని వైసీపీ కార్యకర్తలుగా మారారన్నారు.  ప్రజలను ఇష్టారాజ్యంగా కొట్టే హక్కు ఎవరిచ్చారంటూ..సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలి. విచక్షణారహితంగా కొట్టిన పోలీసు సిబ్బందిని వెంటనే సస్పెండ్‌ చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు.