నర్సంపేట, వెలుగు: బీఆర్ఎస్ నాయకులపై నర్సంపేట పీఎస్లో కేసు నమోదయ్యింది. ఈనెల 10న నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదుట పెద్ది విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. ఈక్రమంలో విధులను అడ్డుకోవడం, బెదిరించి దుర్భాషలాడారని కానిస్టేబుల్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. ఎస్సై అరుణ్కుమార్పై దాడి చేశారని పిటీషనర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నర్సంపేట టౌన్కు చెందిన శీలం వీరన్న, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, రాయిడి దుష్యంత్రెడ్డి, సంగని సూరయ్య, దోనాల రవి, మరికొంత మందిపై కేసు ఫైల్ చేశారు.
