అక్రమ మద్యం రవాణాపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసుల కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా అక్రమ మద్యంను తరలిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. విశాఖపట్నంలో భారీ సంఖ్యలో లిక్కర్, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఈబీ పోలీసులు. నిందితుల నుంచి 2 కోట్ల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు, 10 లక్షలు విలువచేసే లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం